
సినిమాలకుత్రిష గుడ్ బై.. ఆమె చివరి చిత్రం ఇదే
తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్, ప్రస్తుతం లండన్లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్తో మళ్లీ వార్తల్లో నిలిచింది. తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan), ప్రస్తుతం లండన్లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్తో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి కోలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. ఇదే త్రిష నటిస్తున్న చివరి సినిమా కానుందా? ఆమె త్వరలోనే సినిమాలకు పూర్తి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా? అనే చర్చలు నడుస్తున్నాయి. దళపతి విజయ్తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యం,వారిద్దరి కాంబినేషన్కు కోలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గానే ఉంటుంది. ఈమధ్య కాలంలో విజయ్- త్రిష కలిసి కనిపించడం తగ్గింది. విజయ్ రాజకీయాల్లో బిజీగా మారగా.. త్రిష వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఈమధ్యనే లండన్ లో ఫ్రెండ్స్ తో కనిపించిన త్రిష తాజాగా అక్కడే సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాకు శ్రీకారం చుట్టింది. బాలీవుడ్లో ఎయిర్లిఫ్ట్, చెఫ్, పిప్పా వంటి విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా న ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ బ్యానర్.. లోకోమోటివ్ గ్లోబల్, ఫ్యూజన్ ఫ్లిక్స్ సంస్థలతో కలిసి కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ ఈ ఈ సినిమాతో మొదటిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్కుమార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అపర్ణ బాలమురళి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు పవర్ఫుల్ నటీమణులు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతుండటం, లండన్ నేపథ్యంలో సాగే